ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు - lights for nation

చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి ఐక్యతా భావాన్ని చాటారు. అనంతపురం జిల్లాలో పలు గ్రామాల్లో గ్రామస్థులంతా స్వచ్ఛందంగా దీపాలు వెలిగించి, కరోనాపై పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలిపారు.

lights for nation
దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్తులు

By

Published : Apr 6, 2020, 2:24 PM IST

దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు

కరోనా వైరస్​ను అరికట్టేందుకు లైట్స్ ఫర్ నేషన్​ కార్యక్రమంలో గ్రామస్థులు సైతం పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో పొలికి, గుంతకల్లు, గుత్తి గ్రామస్థులు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చి లైట్లు వెలిగించారు. గో కరోనా అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.

టీపీఆర్​ ట్రస్ట్​కు చెందిన పరుశురాం దాదాపు 3000 కొవ్వొత్తులను భారతదేశ చిత్రపట ఆకారంలో మైదానంలో మహిళలచేత వెలుగించారు.

కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టడంలో భాగమైన పోలీసులు తమ విధి నిర్వహణలోనే పోలీస్ స్టేషన్​లో దీపాలు వెలిగించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతా భావాన్ని చాటారు.

ఇదీ చదవండి:గుంతకల్లు కనిపించని సామాజిక దూరం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details