ప్రజారోగ్య భద్రత కోసం కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందు వరసలో నిలిచి పోరాడుతున్న పోలీసులు మరో త్యాగం చేశారు. జిల్లాలో కరోనాను జయించిన 17 మంది పోలీసులు మంగళవారం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. కరోనా తీవ్రత అధికమై ప్రాణాలతో పోరాడే ప్రజలకు.. ప్లాస్మా థెరపీకి వీరి రక్తం ఉపయోగపడనుంది.
కరోనాను జయించారు.. ప్లాస్మాను దానం చేశారు - అనంతపురం పోలీస్ ప్లాస్మా దానం న్యూస్
కరోనాను జయించిన అనంతపురం పోలీసు సిబ్బంది.. ప్లాస్మా దానం చేశారు. వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. కరోనాను జయించి విధుల్లోకి హాజరైన సిబ్బందికి సన్మానం చేశారు.

ప్లాస్మాను దానం చేసిన అనంతపురం పోలీసులు