ఎన్సీసీ విభాగం విస్తరణకు అదనపు సిబ్బందిని,నిధులను సమకూర్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు..తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెడోర్ ఎన్ఎన్ రెడ్డి చెప్పారు.అనంతపురంకు మంజూరైన కొత్త బెటాలియన్ కు సిబ్బంది లేకపోవడంవల్ల ఈఏడాది విద్యార్థుల ప్రవేశాలు జరపలేదని తెలిపారు.బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోతే,దాని ప్రభావం ఎన్సీసీ క్యాడెట్ లపై పడుతుందని డీడీజీ చెప్పారు.
రాష్ట్రంలో ఎన్సీసీ విభాగం విస్తరణకు నిధులు లేమి - బెటాలియన్
అనంతపురం జిల్లాలో బెటాలియన్ మంజూరైందని, సిబ్బంది లేకపోవడంవల్ల నిలుపుదల చేసినట్లు ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెడోర్ ఎన్ఎన్ రెడ్డి తెలిపారు.
![రాష్ట్రంలో ఎన్సీసీ విభాగం విస్తరణకు నిధులు లేమి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4428825-729-4428825-1568372506001.jpg)
అనంతపురం బెటాలియన్