అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబుకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ' స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ' అవార్డు దక్కింది. లాక్డౌన్ సమయంలో కరోనా వేగంగా విస్తరించకుండా దోహదం చేసిన సువిధ అప్లికేషన్కు ఈ అవార్డు దక్కింది. దిల్లీకి చెందిన స్కోచ్ గ్రూపు వారు ఈ అవార్డును ఎస్పీకు ఇవాళ ఆన్లైన్లో అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తుండటాన్ని దేశవ్యాప్తంగా గుర్తించి ప్రతీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో కరోనా విస్తరించకుండా ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు, మందులు (మెడిసిన్స్) పంపేందుకు జిల్లా ఎస్పీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సువిధ అప్లికేషన్ను రూపొందించి అమలు చేశారు. నిత్యావసర దుకాణాలు, మందుల దుకాణాల యజమానులను ఈ యాప్లో పొందుపరిచి ప్రజల ఇళ్ల వద్దకే అన్నిరకాల సరుకులు డోర్ డెలివరీ చేశారు. యాప్ రూపొందించడంలో సహకరించిన జిల్లా పోలీసు టెక్నికల్ విభాగం సీఐ హమీద్ ఖాన్ , ఎస్సై క్రాంతికుమార్ , ఆర్ ఎస్సై సురేష్ రెడ్డి, యాప్ డెవలపర్ మణికంఠలను జిల్లా ఎస్పీ అభినందించారు.