ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2020, 4:44 PM IST

ETV Bharat / state

అమరావతి పరిరక్షణ సమితి సభ్యుల రిలే దీక్ష విరమణ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్​చార్జ్​ పరిరక్షణ సమితి సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Amravati Conservation Committee members relay initiation
అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష విరమణ

రాజధాని రైతులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష చేపట్టారు. మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 150 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి సంఘీభావం తెలుపుతూ కదిరిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిరక్షణ సమితి సభ్యులు ప్ల కార్డులతో రిలే దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్​చార్జ్​ కందికుంట వెంకటప్రసాద్ పరిరక్షణ సమితి సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details