హైటెక్ స్థాయిలో.. ఓటర్లకు డబ్బు పంపిణీ?? - ap elections 2019
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని వైకాపా నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు బయటికి వచ్చాయి.
![హైటెక్ స్థాయిలో.. ఓటర్లకు డబ్బు పంపిణీ??](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2906307-thumbnail-3x2-ycp.jpg)
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని వైకాపా నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు బయటికి వచ్చాయి. కొందరు వ్యక్తులు వైకాపా తరఫున ఓటర్లను కలుస్తూ.. ఆ పార్టీ ముద్రించిన కార్డులు పంచుతున్నట్టు తెలిసింది. 7, 8వ తేదీల్లో తాము చెప్పిన చోటుకు వెళ్లి.. ఆ కార్డులు చూపిస్తే డబ్బులు ఇస్తారని ప్రలోభానికి గురి చేస్తున్నట్టుగా.. అక్కడి ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. కేసు నమోదైంది.