అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి గ్రామం వద్ద ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ను అఖిలపక్ష నేతలు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సమస్యలను వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వైరస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. అలసత్వం వహించకూడదని వైద్యులను కోరారు. డాక్టర్లు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని నాయకులు చెప్పారు.
కొవిడ్ కేర్ సెంటర్ను సందర్శించిన అఖిలపక్ష నేతలు
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను అఖిలపక్ష నాయకులు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్ కేర్ సెంటర్ సందర్శన