అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్, అంజి నాయక్ అనే వ్యక్తులు... బాబూ నాయక్, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మురుగు నీటి గుంతపై వివాదం.. మహిళపై దాడి - attacks in ananthapur district
మురుగు నీటి గుంత విషయంలో ఇరుగు పొరుగు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. ఓ మహిళపై దాడికి దారి తీసింది. అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
![మురుగు నీటి గుంతపై వివాదం.. మహిళపై దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4489116-thumbnail-3x2-dadigupta.jpg)
మహిళపై దాడి