ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసు స్టేషన్​ ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. అప్రమత్తమైన పోలీసులు.. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

By

Published : Jan 7, 2021, 6:02 AM IST

a person suicide attempt at police station
పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కదిరి పట్టణం వలీసాబ్ రోడ్డు నివాసి రియాజ్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రియాజ్..​ తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించటం లేదని ఓబులదేవర చెరువు చెందిన మహబూబ్ బాషా ఓడీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్టేషన్​కు రావాలని ఎస్ఐ ఫోన్ చేయగా.. డబ్బుల విషయంలో మందలిస్తారని భయపడిన రియాజ్ సమీపంలోని కదిరి పట్టణ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్​ను ఒంటిపై చల్లుకుంటుండగా.. గుర్తించిన పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details