అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పాడుబడిన రైల్వే క్వార్టర్స్లో అశోక్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చికెన్ కబాబ్ సెంటర్ నిర్వహిస్తూ అశోక్ తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో ఇటీవల భార్యతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీనిపై కలత చెందిన అశోక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..! - ధర్మవరం పాత రైల్వే క్వార్టర్స్లో వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పాడుబడిన రైల్వే క్వార్టర్స్లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు ఆత్మకూరు గ్రామానికి చెందిన అశోక్గా గుర్తించారు. ఇటీవల భార్యతో వివాదం కారణంగానే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిస్తోంది.
![భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..! మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5866288-549-5866288-1580184113635.jpg)
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఇదీ చూడండి: