కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా యు.బసవనపల్లిలో జరిగింది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం జిల్లా పరిగి మండలం యు.బసవనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఉన్న చెట్టుకు నగేష్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పరిగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.