ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీటి కుంటలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

By

Published : Jan 2, 2020, 12:35 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని తంబళ్ల పల్లి గ్రామంలో నూతన సంవత్సరం వేళ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గగన్​రెడ్డి అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందాడు.

A four years old boy dies in a pool of water at thamballa palli
నీటి కుంటలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

నీటికుంటలో పడి చనిపోయిన బాలుడు

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని తంబళ్ల పల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గగన్​రెడ్డి అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం సమీపంలోని తోటకు వెళ్తూ.. బాలుణ్ని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ ఆడుకుంటూ గగన్​రెడ్డి సమీపంలోని నీటికుంటలో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు.. నీటి కుంటలో బాలుడి మృతదేహం గుర్తించారు. తమ బిడ్డ కళ్లముందే చనిపోవడం చూసిన వారు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details