ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఔషధ దుకాణాల యజమానులతో తనిఖీ అధికారి విందు - కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు యజమాని రైతుకు నాసిరకం మందులు

నిబంధనలు ఉల్లంఘించిన ఔషధదుకాణాన్ని తనిఖీ చేయవలిసిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొన్నారు. తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

A drug inspector dinner with medical shop owners A drug inspector dinner with medical shop owners

By

Published : Sep 17, 2019, 9:54 AM IST

నిబంధనలు ఉల్లంఘించిన ఔషధ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఐదు రోజుల క్రితం ఓ ఔషధ దుకాణం యజమాని రైతుకు నాసిరకం మందులు ఇవ్వడంతోపాటు... ఆయనపై దాడిచేయడంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు సంబంధిత మెడికల్ స్టోర్ తనిఖీ చేయాలనిపై అధికారులు సూచించారు. తనిఖీకి వచ్చిన ఔషధ తనిఖీ అధికారి..ఏకంగా ఔషధ దుకాణాల సంఘ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావటంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో చర్చనీయాంశమైంది .

మెడికల్ షాపు యజమానులతో కలిసి ఔషధతనిఖీ అధికారి విందు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details