ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 2:29 PM IST

ETV Bharat / state

పొలంలో నిద్రిస్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి

పొలంలో మోటర్ వేయడానికని వెళ్లిన రైతు.. అక్కడే నిద్రపోయాడు. ఆదమరచి నిద్రించిన అతనిపై ఎలుగుబంటి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. తీవ్ర రక్తస్రావమైన రైతును.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

A bear attack on a farmer who sleeps on the farm at mellakunta in ananthapuram district
A bear attack on a farmer who sleeps on the farm at mellakunta in ananthapuram district

అనంతపురం జిల్లా కంబదూరు మండలం మేళ్లకుంట గ్రామంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. పొలంలో పడుకున్న రామాంజనేయులు అనే రైతుపై దాడి చేసింది. గ్రామ శివార్లలో ఉన్న తన పొలంలో మోటర్ వెయ్యటానికి వెళ్ళిన రామాంజనేయులు.. అక్కడి నిద్రపోయాడు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలుగుబంటి అతనిపై చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా రక్తస్రావంతో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details