ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం - అనంతపురం జిల్లాలో గంజాయి స్వాధీనం

ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​ కు తరలించారు.

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం

By

Published : Oct 11, 2019, 9:14 PM IST

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన ఓబులుపతి అనే వ్యక్తి గత కొంత కాలంగా కర్ణాటక లోని బళ్లారి నుంచి గంజాయిని తీసుకువచ్చి ఉరవకొండలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముందస్తు సమాచారం అందిన మేరకు.. స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ఓబులుపతి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details