ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2021, 2:21 PM IST

Updated : Jun 4, 2021, 5:44 PM IST

ETV Bharat / state

'తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రి ప్రారంభం'

జర్మన్ హ్యాంగర్ విధానంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 పడకల కొవిడ్ తాత్కాలిక ఆసుపత్రి ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానం ద్వారా దీన్ని ప్రారంభించారు

covid hospital inaugurated at tadipathri by cm jagan
covid hospital inaugurated at tadipathri by cm jagan

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రిని సీఎం జగన్​ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆస్పత్రిని ప్రారంభించారు. ఆర్జాస్ స్టీల్ సహకారంతో ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయమని సీఎం అన్నారు. జర్మన్ హ్యాంగర్స్‌తో ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎం.శంకర్ నారాయణ, అనంతపురం ఎంపీ రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అర్జాస్ కంపెనీ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి, డైరెక్టర్ జయ ప్రకాష్ రాజ్, అధికారులు పాల్గొన్నారు

Last Updated : Jun 4, 2021, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details