ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

41 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - gutti

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు.

రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jul 29, 2019, 6:08 PM IST

రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గుంతకల్లు నుంచి గుత్తికి వస్తున్న బొలెరో వాహనంలో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందిచగా.. అక్రమ రేషన్ బియ్యంగా నిర్థరించారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాటిని మిల్లులకు తరలించి సన్నబియ్యంగా మార్చి పక్కరాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని అక్రమ రవాణాపై విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details