ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

190 బ్యాగుల కాంప్లెక్స్ ఎరువులు సీజ్ - Anantapur Latest news

అనంతపురం జిల్లా మడకశిరలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 190 బస్తాల ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 1,82,120 రూపాయలు ఉంటుందని వివరించారు. అనుమతులు లేకుండా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Madakasira Fertilizer shops
ఎరువుల దుకాణంలో రసీదులు పరిశీలిస్తున్న అధికారులు

By

Published : Sep 8, 2020, 10:35 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కృష్ణ మీనన్, అధికారి తిమ్మప్ప.. ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మోహిత్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణంలో అనుమతి లేకుండా నిల్వ ఉన్న 1,82,120 రూపాయల విలువ గల 190 బ్యాగుల కాంప్లెక్స్ ఎరువును సీజ్ చేశారు.

ఎరువులను అనుమతి లేకుండా అమ్మడం, అధిక ధరలకు విక్రయం, రికార్డు నిర్వహణ పాటించకపోవడం చట్టరీత్యా నేరమని వివరించారు. ఇలాంటి ఎరువుల దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details