YCP attack on TDP: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపెంటలో తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించారు. ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు అనుచరులే దాడి చేస్తున్నారని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీవీజీ కుమార్ ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొచ్చేందుకు స్థానిక ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
విద్యుత్ నిలిపివేసి.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు.. - అనకాపల్లి టీడీపీ వార్తలు
YCP attack on TDP:మరోసారి వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై దాడికి యత్నించారు. ఈ సారి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపెంటలో.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీవీజీ కుమార్ మండిపడ్డారు.
![విద్యుత్ నిలిపివేసి.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు.. tdp incharge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17312671-392-17312671-1672039807174.jpg)
నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి
టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన వైసీపీ శ్రేణులు