ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 28, 2022, 12:20 PM IST

Updated : Oct 28, 2022, 2:18 PM IST

ETV Bharat / state

అనకాపల్లిలో చిరుత పులి సంచారం....

Leopard Roaming: అనకాపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున దిబ్బపాలె గ్రామ శివారులో ఓ పశువుల పాకలో ఉన్న ఆవు దూడపై దాడి చేసింది.

Leopard
చిరుత పులి

Leopard wandering:అనకాపల్లి జిల్లా దిబ్బ పాలెంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దిబ్బపాలేంలో రమణ అనే రైతుకు చెందిన ఆవులు, దూడలను ఊరికి సమీపంలోని పాకలో ఉంచాడు. తెల్లవారు జామున అక్కడి వెళ్లి చూడగా ఒక దూడ చనిపోయి ఉంది. రాత్రి సమయంలో ఆ దూడపై ఏదో జంతువు దాడి చేసిందని భావించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న పాద ముద్రలను పరిశీలించి చిరుత పులిగా గుర్తించారు. చోడవరం అటవీ రేంజర్ రవి వర్మ అధ్వర్యంలో పులి పాదముద్రలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు.

అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం పెరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళను చెందుతున్నారు. ఇది వరకు కసింకోట మండలంలో పులులు సంచరించి, ఆవులు, దూడలను బలి తీసుకున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పుడు దిబ్బపాలెంలో సమీపంలో చిరుత సంచారం వల్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 28, 2022, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details