ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీచే అల్లూరి అనుచరుల కుటుంబాలకు సత్కారం !

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్నిప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది.

By

Published : Jul 2, 2022, 9:58 PM IST

ప్రధాని మోదీచే అల్లూరి అనుచరుల కుటుంబాలకు సత్కారం
ప్రధాని మోదీచే అల్లూరి అనుచరుల కుటుంబాలకు సత్కారం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది.

ఈ మేరకు క్షత్రియ పరిషత్ నర్సీపట్నం సభ్యులు డీవీఎస్ రాజు అల్లూరి జిల్లా నడుంపాలెం లంకవీధి జీడితోటల్లో ఉంటున్న గంటం దొర మనువడు బోడి దొర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానించారు. ఏ ప్రభుత్వం వీరిని ఆదుకోలేదని..,ఇప్పటికి వీరు పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని డీవీఎస్ రాజు అన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా తమ వంతుగా సాయం చేసేందుకు వీరిని ప్రధాని వద్దకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details