ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 12, 2022, 9:19 PM IST

ETV Bharat / state

ACB Trap: రూ.40 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పి.గన్నవరం ఎంపీడీవో

ACB traps: రాష్ట్రవ్యాప్తంగా రోజు ఎక్కడో ఒకచోట అవినీతి తిమింగళాలు బయటపడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒకరు పట్టుబడుతున్నా.. లంచాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు వెనకాడడం లేదు. అలాంటి ఘటనే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జరిగింది.

ACB traps
ఏసీబీ అధికారుల వలలో చిక్కిన పి.గన్నవరం ఎం.పి.డి.ఓ


ACB traps P Gannavaram MPDO: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎంపీడీవో కె.ఆర్. విజయ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమె రోజు మాదిరిగానే ఆఫీసుకు వచ్చారు. అప్పటివరకు కార్యాలయం ప్రశాంతగానే ఉంది. ఉన్నట్లుండి ఏసీబీ అధికారులమంటూ కొందరు ఆమె ముందు నిల్చున్నారు. తీరా చూస్తే ఆమె చేతిలో ఉపసర్పంచ్ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇంకేముంది రెడ్ హ్యాండెడ్​గా ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఆమె పట్టుబడ్డారు. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను పంచాయతీకి కేటాయించాలంటే.. రూ.50 వేలు చెల్లించాలని ఉపసర్పంచ్‌తో ఆమె ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 6న రూ.10 వేలు చెల్లించగా.. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఉప సర్పంచ్ విజయలక్ష్మి.. అనిశా అధికారులను ఆశ్రయించారు. కార్యాలయంలో రూ.40వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details