ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

ఇంగ్లండ్​తో తలపడే భారత మహిళా జట్టిదే.. - india england womens cricket match in wankade stadium

న్యూజిలాండ్​తో వన్డే సిరీస్ గెలిచి ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇంగ్లండ్​పైనా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్వదేశంలో భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్​తో జరిగే షెడ్యూల్​ను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీ రాజ్​ ఈ సిరీస్​కూ కెప్టెన్టీ భాద్యతలు చేపట్టనుంది.

ముంబయి వాంఖడే స్టేడియంలో భారత్​-ఇంగ్లాండ్​ మ్యాచ్​

By

Published : Feb 9, 2019, 10:49 PM IST

ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మన జట్టు ఫిబ్రవరి 22 నుంచి ముంబయిలో ఇంగ్లీష్​ జట్టుతో మ్యాచ్​లు ఆడనుంది. ఐసీసీ మహిళా ఛాంపియన్​షిప్​లో భాగంగానే ఈ మూడు వన్డేలు స్వదేశంలో జరగనున్నాయి. మ్యాచ్​లన్నింటికీ ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఇంతకు ముందే న్యూజిలాండ్​పై వన్డే సిరీస్​ను 2-1తేడాతో గెలిచి జోరుమీదుంది టీమిండియా. ఈ సిరీస్​కు ముందు ప్రెసిడెంట్స్ ఎలెవన్స్​తో ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 18న వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

  • భారత మహిళా వన్డే జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), జులాన్ గోస్వామి, స్మృతి మంధానా, జెమామి రోడ్రిగ్జ్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా(వికెట్ కీపర్), ఆర్ కల్పన(వికెట్ కీపర్), మోనా మేస్రమ్, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్, శిఖా పాండే, మాన్షి జోషి, పూనమ్ రౌత్.
  • బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: స్మృతి మంధానా(కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్యా, ఎస్ మేఘన, భారతి పుల్​మలి, కోమల్ జన్జాద్, ఆర్ కల్పన, ప్రియా పూనియా, హర్లిన్ డియోల్, రీమా లక్ష్మి, మనాలి దక్షిణి, మిన్నూ మణి, తనూజ కన్వర్.

ABOUT THE AUTHOR

...view details