ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

చివరి వన్డేకు గప్తిల్​ దూరం..!

ఆదివారం భారత్​తో జరిగే అయిదో వన్డేకు న్యూజిలాండ్​ ఓపెనింగ్ బ్యాట్స్​మన్​ మార్టిన్​ గప్తిల్​ దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

By

Published : Feb 2, 2019, 12:17 PM IST

మార్టిన్​ గుప్తిల్

భారత్​-న్యూజిలాండ్​ మధ్య వన్డే సిరీస్​లో చివరిదైన అయిదో మ్యాచ్​కు కివీస్​ ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ మార్టిన్​ గుప్తిల్​ దూరమయ్యే అవకాశం ఉంది.

ఫీల్డింగ్​ ప్రాక్టీస్​ సమయంలో బంతిని విసిరేటపుడు గప్తిల్​ గాయపడ్డాడు. వెన్నెముక కింది భాగంలో తీవ్రనొప్పితో మైదానం నుంచి నిష్ర్కమించాడు.

చివరి వన్డేలో గప్తిల్​ స్థానంలో కాలిన్​ మున్రోను జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంచింది జట్టు యాజమాన్యం. గాయం పెద్దది కాదని, టీ-ట్వంటీ సిరీస్​కు గుప్తిల్​ అందుబాటులో ఉంటాడని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details