ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థల సేకరణ - Chiranjeevi_Nagarjuna_Talasani Srinivas Yadav

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున‌తో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మరోసారి భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సంక్షేమంపై చర్చించారు.

Heroes Chiranjeevi, Nagarjuna meeting with talasani
ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థల సేకరణ

By

Published : Feb 10, 2020, 11:32 PM IST

ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థల సేకరణ

తెలుగు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​ అన్నపూర్ణ స్టూడియోలో ఈ భేటీ నిర్వహించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.

ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థల సేకరణ చేయాలని రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. కల్చరల్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూమితో పాటు... సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని చూడాలని కూడా సూచించారు.

సింగిల్ ​విండో విధానంలో షూటింగ్​లకు త్వరితగతిన అనుమతులు... ఎఫ్​డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని తలసాని తెలిపారు. పైరసీ నివారణకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఆన్​లైన్​ టికెటింగ్ విధానం అమలు... ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత అంశాలను చర్చించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

11 జాతీయ సంస్థలతో ప్రభుత్వ 'భరోసా' ఒప్పందాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details