ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

పదిహేనేళ్లకే...ప్రపంచపటంలో మరో దేశంగా

పంతొమ్మిదేళ్ల కుర్రాడు చేతిలో తయారైంది ఆ వెబ్​సైట్​..ఈరోజు సుమారు 230కోట్ల జనాభాకు దగ్గరయింది. అంతర్జాల రాజ్యంలో ఆ మహారాజుకి నేటితో 15ఏళ్లు నిండాయి.ఆ యోధుడి పేరే ఫేస్​బుక్​.

By

Published : Feb 5, 2019, 3:38 PM IST

పదిహేనేళ్లకే...ప్రపంచపటంలో మరో దేశంగా

అమెరికాలో పుట్టి ప్రపంచ ప్రజానీకం నాడిని పట్టుకోగలిగింది ఫేస్​బుక్​. పదిహేనేళ్లలో 232 కోట్ల జనాభాతో మమేకమైంది. ఈరోజు సామాజిక బంధాలను మార్చే స్థితికి వచ్చిందంటే కారణం ప్రజలు ఆ బుక్​పై పెంచుకున్న ప్రేమే..ఈ మధ్య కాలంలో ఎన్నో ఆరోపణలు, అవాంతరాలు ఎదుర్కొంటున్న వ్యవస్థాపకుడు మార్క్​ జుకెర్​బర్గ్...దీన్ని 2004లో ప్రపంచానికి పరిచయం చేశాడు. కాని ఇతడినే సీఈవో స్థానం నుంచి వైదొలగాలంటూ వ్యతిరేకత వ్యక్తమవడం ఎంత చిత్రమో కదా...!

50వేల కోట్ల ఆదాయం..
అంతర్జాలంలో తక్కువ సమయంలో ఎవ్వరూ ఊహించనంతగా, ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగింది ఈ సామాజిక మాధ్యమం. 2018 నాటికి 39 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో...ఫేస్​బుక్​ వినియోగదారులను ఒకదగ్గర చేరిస్తే 76వ ధనవంతమైన దేశంగా మారేదట..
  • జుకెర్​ 'బుక్​' ప్రస్థానం:

అమెరికాకు చెందిన మార్క్​ జుకర్​బర్గ్​ పంతొమ్మిదేళ్ల వయస్సులో... ఫిబ్రవరి 4, 2014న ఓ వెబ్​సైట్​ రూపొందించాడు. దాని పేరే ఫేస్​బుక్​. విడుదల చేసిన 24 గంటల్లో తన కళాశాల విద్యార్థులు వేయి మందిభాగస్వాములయ్యారు. జుకర్​ తమ ఐడియాను కాపీ కొట్టాడంటూ ప్రారంభించిన వారం రోజుల్లోనే హార్వర్డ్​​కు చెందిన కేమరూన్​, టైలర్​, దివ్య నరేంద్రలు ఆరోపించారు. నాలుగు సంవత్సరాల తరవాత ఆ కేసు కొంతమొత్తంతో పరిష్కారమైంది.​

హార్వర్డ్​​కు చెందిన కేమరూన్​, టైలర్

పూర్తిస్థాయిలో2006 సెప్టెంబరులోఅందుబాటులోకి వచ్చింది ఫేస్​బుక్​. మంచి జోష్​ మీదున్న వెబ్​సైట్​ను కొనేందుకు యాహూ సంస్థ రూ. 71వేల కోట్ల రూపాయలు ఇస్తానని ఆశచూపింది. అందుకు జుకెర్​బర్గ్​ అంగీకరించలేదు. సరిగ్గా 2009లో ఐదేళ్లు నిండేసరికి ఫేస్​బుక్​ లాభాల్లో దూసుకెళ్లడం ప్రారంభించింది. 2010లో మైస్పేస్​ అనే సైట్​నూ కలుపుకొని ప్రపంచంలోనే ప్రముఖ సోషల్​ నెట్​వర్కింగ్​ సైట్​గా అవతరించింది. 2011లో ఫేస్​బుక్​కు పోటీగా గూగుల్​ సంస్థ గూగుల్​ ప్లస్​ను ప్రారంభించింది. అది విఫలమైంది. గూగుల్​ ఆ నెట్​వర్క్​ను ఈ ఏడాది పూర్తిగా మూసేసింది.

మై స్పేస్​ సైట్​
  • 2012 మార్చి 18,ఫేస్​బుక్​ పబ్లిక్​ ఆఫరింగ్​కు వెళ్లింది. లక్షా 14వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించి అమెరికా​ చరిత్రలో మూడో పెద్ద ఐపీవోగా రికార్డుల్లోకెక్కింది. 2012లో 71వేల కోట్ల రూపాయలు పైగా చెల్లించి ఇన్​స్టాగ్రామ్​ను సొంతం చేసుకొంది ఈ దిగ్గజ సంస్థ. 2012 అక్టోబరు 4 నాటికి 100 కోట్ల నెటిజన్లను సభ్యులుగా మార్చుకుంది.2014లో సుమారు 19 వందల కోట్ల రూపాయలు చెల్లించి మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ను కలిపేసుకుంది. 2017 జూన్​ కల్లా 200కోట్ల సభ్యుల మైలురాయిని దాటింది.
    పోటీగా వచ్చిన గూగుల్​+

2018 మార్చి 17న యూకే సంస్థ కేంబ్రిడ్జ్​ అనలిటికా డేటా దుర్వినియోగం కేసులో ప్రధానపాత్ర పోషించినట్లు ఫేస్​బుక్​పై ఆరోపణలు వచ్చాయి. సుమారు 87 కోట్ల ఖాతాల్లోని సమాచారం అనుమతి లేకుండా అమ్ముకున్నట్లు కేసు నడుస్తోంది. 2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసినట్టు తేలింది. ఇన్ని కేసులు వచ్చినా, ఫేస్​బుక్​ను​ తొలగించాలని ఎన్నో చర్చలు నడిచినా 50వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు 15వ వార్షికోత్సవంసందర్భంగా వెల్లడించింది టెక్ సంస్థ.

ఇన్​స్టాను సొంతం చేసుకున్న ఫేస్​బుక్​
ఇంత గొప్ప ప్రస్థానంలో యూజర్లు ఈ యాప్​ వాడుతూ సంతోషంగా ఉండలేకపోతున్నారని ఓ సర్వే వెల్లడించింది. దీని వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయని ఆరోపించేవారు ఎక్కువవుతున్నారు. ఎన్ని వివాదాలు వచ్చినా పదిహేనేళ్ల కాలంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఫేస్​బుక్​కు ఎదిగిందంటే ప్రజాభిమానమే అండ అనడంలో అతిశయోక్తే లేదు.
76వ ధనవంతమైన దేశంగా మారేదట

ABOUT THE AUTHOR

...view details