ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణలో పోలీసులపై రాళ్లదాడి

తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా​ కోయిల్​కొండ గ్రామస్థుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై రాళ్లదాడితో యుద్ధ వాతావరణం నెలకొంది.

By

Published : Feb 4, 2019, 3:37 PM IST

12

2
తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా కోయిల్​కొండ మండలం దమ్మాయిపల్లి గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోయిల్​కొండను మహబూబ్​నగర్ జిల్లాలోనే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రహదారిపై వంటావార్పు చేశారు. అదే సమయంలో.. ఓ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్​కు దారి ఇవ్వకపోవడం వల్ల పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు లాఠీ చార్జీ చేశారు. నిరసనకారులు రాళ్లదాడితో ప్రతిఘటించారు. దాడిలో సీఐ పాండురంగారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details