ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాటర్ హీటర్ షాక్ కొట్టి.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి

By

Published : Dec 19, 2020, 10:27 AM IST

Updated : Dec 19, 2020, 5:47 PM IST

current shock
current shock

10:25 December 19

విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సతీష్‌, కవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటి లాగే ఈరోజు ఉదయం కూడా హీటర్‌తో నీళ్లు కాచే సమయంలో వాటర్‌ హీటర్‌కు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో కవిత(35) విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్‌ కుమార్‌(11), వెంకటసాయి(8) తల్లిని పట్టు కోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి మరణించడంతో కవిత భర్త సతీష్‌ హతాశుడయ్యాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు హాలహర్వి ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

దేశంలో కోటి మార్కును దాటిన కరోనా కేసులు

Last Updated : Dec 19, 2020, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details