ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు - కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

ఇళ్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం. కొద్దిగంటల్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అది కూడా కళ్యాణ మండపంలోనే. తెలంగాణలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో సందీప్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

By

Published : Nov 10, 2019, 11:47 PM IST

కాసేపట్లో పెళ్లి.... అంతలోనే అనంతలోకాలకు

తెలంగాణలోని మేడ్చల్‌లో దారుణం జరిగింది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికుమారుడు సందీప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. వేకువజామునే వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు.

ఏడు గంటల సమయంలో ఫంక్షన్‌ హాల్‌లో ఓ గదిలోకి ఒంటరిగా వెళ్లి సందీప్‌ గడియ పెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవటం వల్ల అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా సందీప్‌ అప్పటికే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసా చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:

కళింగపట్నంలో సముద్ర స్నానానికి వెళ్లి.. విద్యార్థుల గల్లంతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details