ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

సరదాగా వెళ్లాడు.. సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలొదిలాడు! - Adolabad district latest news

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతం వద్ద ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు.

selfie-craze
selfie-craze

By

Published : Oct 11, 2020, 8:00 PM IST

సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయి దుర్మరణం చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కార్పెంటర్ ఆకాశ్... స్నేహితులతో కలిసి ఖండాల జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లాడు.

జలపాతం వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. కాపాడేందుకు తోటి స్నేహితులు ప్రయత్నంచిన ఫలితం లేకుండా పొయింది. ఈ ఘటనలో ఆకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details