ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 11:35 AM IST

ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​లో దారుణం జరిగింది. అన్నం పెట్టమని పిలిచి.. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడో ప్రబుద్ధుడు.

rape-attempt
rape-attempt

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను రాములు(40) అనే వ్యక్తి అన్నం పెట్టమని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు.

అతని నుంచి తప్పించుకున్న బాలిక ఇంట్లో వారికి చెప్పడంతో 100 కు డయల్ చేశారు. పోలీసులు బాలికను సఖి కేంద్రానికి తరలించి వివరాలు సేకరించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధరూర్ సీఐ మురళీకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:మోదీ చేతుల మీదుగా అటల్​జీ సొరంగ మార్గం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details