ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లెలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : May 9, 2019, 6:28 AM IST

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

రాజంపేట డీఎస్పీ మురళీధర్ అందించిన సమాచారం ప్రకారం ఓబులవారిపల్లె మండలం బొంతవారిపల్లిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సై మోహన్ ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 చరవాణులు, క్రికెట్ బెట్టింగ్ స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు దిగువ పల్లెకు చెందిన షేక్ మౌలానా, వెంకటరమణ, కటికంవారిపల్లికి చెందిన నాగేంద్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details