చిత్తూరు జిల్లా మదనపల్లె-పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బండకిందపల్లికి వెళ్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు బోల్తాపడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 20మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎర్రబల్లి, బండకిందపల్లికి చెందినవారుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి
accident
16:05 November 03
చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా
అతివేగంగా వస్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న బండరాయిని బస్సు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేవలం 15 సీట్లున్న ప్రైవేట్ మినీ బస్సులో....30మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదస్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు వెంటనే అంబులెన్సు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి ప్రైవేట్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి
Last Updated : Nov 3, 2020, 6:01 PM IST