హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో శనివారం మిట్టమధ్యాహ్నం జరిగిన గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆర్ఎక్స్ స్పోర్ట్స్ ద్విచక్ర వాహనంతో పాటు 4 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో సీపీ అంజనీ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు - అంబర్పేట డీడీ కాలనీ
హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో శనివారం జరిగిన గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం రేపిన ఈ కేసులో నిందితులిందరిని అరెస్ట్ చేశారు.
![మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3968906-983-3968906-1564297832018.jpg)
4-thulsa-gold-chori-in-ambarpet
మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు
ఇవీ చూడండి:మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ