ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2020, 12:16 PM IST

ETV Bharat / jagte-raho

సలాం కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

సలాం కుటుంబం ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కేంద్రం, సీబీఐకి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

High Court
High Court

నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై విచారించిన హైకోర్టు.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్నందున... ఆ శాఖవారితోనే విచారణ చేయించడం సమంజసం కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. సలాం కుటుంబ సెల్ఫీ వీడియోను పోలీసులు తమ ఎఫ్​ఐఆర్​లో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున ఏఏజీ సుధాకకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details