అతివేగం... ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్కల్కు కారులో బయలుదేరగా.. కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొంది.
అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు.. - హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదం
చుట్టూ మృతదేహాలు... అక్కడ ఓ పిల్లాడు. అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకి పోయాయి. అయినా అమ్మ లేవట్లేదు. ఇంటికెళ్దాం అమ్మా అంటూ ఏడుపు.. ఈ దృశ్యం చూస్తే ఎవరి మనసునైనా కలిచి వేస్తోంది.
![అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు.. అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9736796-335-9736796-1606898940517.jpg)
అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..
ఈ ఘటనలో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఓ పిల్లాడు వాళ్ల అమ్మ మృతదేహం పక్కన కూర్చోని ఏడుస్తున్నాడు. రా అమ్మా... ఇంటి కెళ్దామంటూ... బోరుమంటున్నాడు.. ఈ ఘటన ప్రస్తుతం అందరిని కలిచివేస్తోంది.
ఇదీ చూడండి: గూడూరులో భారీ పేలుడుతో కారు ధ్వంసం