ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి యువకుడి మృతి - medchal district news

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత మంది చెప్పినా చెప్పినా కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి సంఘటనే తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా సుచిత్రలో చోటుచేసుకుంది. ఓ యువకుడు అతిగా మద్యం సేవించి ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు.

one-person
one-person

By

Published : Nov 13, 2020, 12:30 AM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన థామస్​ (25) ఏడు నెలల క్రితం భాగ్యనగరానికి వచ్చి సుచిత్రలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో నివాసముంటూ ఏసీ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించాడు. ఆ మత్తులో మూడంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది.

ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details