ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చరవాణి కోసం పురుగుల మందు తాగిన తల్లీకూతుళ్లు - mother and daughter died for phone

హైదరాబాద్​ అంబర్​పేట పోలీస్​స్టేషన్​ పరిధిలో చరవాణి విషయమై గొడవ పడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగారు. పరిస్థితి విషమించి తల్లి మృతిచెందగా.. కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

hyderabad
చరవాణి కోసం పురుగులు మందు తాగిన తల్లి కూతుళ్లు

By

Published : Jul 10, 2020, 4:24 PM IST

చరవాణి విషయమై గొడవపడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగారు. పరిస్థితి విషమించి తల్లి మృతిచెందగా.. కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్​ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. గోల్నాక జైస్వాల్‌గార్డెన్‌లో నివాసం ఉండే శ్రీనివాస్‌, నీరజ(39) దంపతులు. వీరికి కుమార్తె భువనేశ్వరి (18), కుమారుడు దీపక్‌సాయి ఉన్నారు. పని నిమిత్తం శ్రీనివాస్‌ బుధవారం రాత్రి నాదర్‌గుల్‌ వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో చరవాణి విషయంలో తల్లీకూతుళ్లు గొడవపడ్డారు.

నీరజ ఆవేశంతో పురుగుల మందు తాగింది. భువనేశ్వరి కూడా తాగటంతో.. ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. 108కు సమాచారం ఇవ్వటంతో ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 6 గంటలకు తల్లి మరణించారు. కుమార్తె చికిత్స పొందుతోంది. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిఃగ్రామస్థుల వద్ద రూ.10 కోట్లు అప్పు చేసి పరారైన కాంట్రాక్టర్

ABOUT THE AUTHOR

...view details