హైదరాబాద్ సనత్నగర్లో విషాదం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న 20 రోజులకే అన్నపూర్ణ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోన్న ఆమె స్థానిక రామారావునగర్లో నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో శవమై కనిపించింది. అన్నపూర్ణ 20 రోజుల క్రితమే దాసరి కార్తిక్ అనే స్థిరాస్తిని వ్యాపారిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నపూర్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్స్టేషన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వివాహిత మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
మెడ, తలపై గాయాలు..