ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కలిసే అనంతలోకాలకు వెళ్లిపోయారు! - సిద్దిపేటలో ప్రేమజంట ఆత్మహత్య వార్తలు

వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం అబ్బాయి చనిపోగా.. ఆదివారం తెల్లవారుజామున అమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వెంకటాపూర్​లో జరిగింది.

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కలిసే అనంతలోకాలకు వెళ్లిపోయారు!
ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కలిసే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

By

Published : Oct 11, 2020, 5:51 PM IST

సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన హారిక ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 8న వెంకటాపూర్ నుంచి వెళ్లిపోయిన ఆనంద్, హారిక ఊరి దగ్గరలోని మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం మామిడితోటలోని ఓ గదిలో వారిని గుర్తించిన ఆనంద్​ తండ్రి హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందింది. శనివారం సాయంత్రం ఆనంద్ చనిపోగా... ఆదివారం తెల్లవారుజామున హారిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details