ట్రావెల్స్ బస్సుల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కుసుమ పాల్ రాజ్.. విజయవాడ, రాజమండ్రి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేవాడు. ఇతర ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నాక లాప్ట్యాపులు అపహరించి తరువాత బస్ స్టేషన్లో దిగిపోయేవాడు. దొంగిలించిన వస్తువులను రాజమండ్రిలో విక్రయించేవాడు. ఈ విధంగా సంవత్సర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.
ఈ రోజు ఉదయం కేపీహెచ్బీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించిన కుసుమ పాల్రాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు బయటపడ్డాయి. అతని నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన 10 లాప్ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.