ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో రాజమహేంద్రవరం లాప్​టాప్​ దొంగ అరెస్ట్ - Laptop Thief in Travels Bus Arrested by KPHB policies in Hyderabad

ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల లాప్​ట్యాప్​లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హైదరాబాద్ కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు.. తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.

laptop-thief-in-travels-bus-

By

Published : Nov 18, 2019, 11:36 PM IST

హైదరాబాద్​లో రాజమహేంద్రవరం లాప్​టాప్​ దొంగ అరెస్ట్

ట్రావెల్స్ బస్సుల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్​కు ప్రయాణిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను హైదరాబాద్ కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కుసుమ పాల్ రాజ్.. విజయవాడ, రాజమండ్రి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేవాడు. ఇతర ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నాక లాప్​ట్యాపులు అపహరించి తరువాత బస్ స్టేషన్​లో దిగిపోయేవాడు. దొంగిలించిన వస్తువులను రాజమండ్రిలో విక్రయించేవాడు. ఈ విధంగా సంవత్సర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.

ఈ రోజు ఉదయం కేపీహెచ్​బీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించిన కుసుమ పాల్​రాజ్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు బయటపడ్డాయి. అతని నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన 10 లాప్​ట్యాప్​లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details