ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

జయరాం కేసులో కొత్తకోణాలు

అమ్మాయి పేరుతో చాట్​ చేసి జయరాంను హైదరాబాద్​కు రప్పించిన రాకేశ్ రెడ్డి చివరకు అతని ప్రాణాలు తీశాడు. ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తడం వల్లనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిందితుడు పోలీసులుకు తెలిపినట్లు సమాచారం.

By

Published : Feb 5, 2019, 11:11 AM IST

jayaram case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జయరాం హత్యకేసు కొలిక్కి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే జయరాం హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.మేనకోడలు శిఖాతోపాటు రాకేశ్​రెడ్డిని విచారించిన పోలీసులు నిజాలు కక్కిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు చర్చిండానికి జయరాంను ఇంటికి పిలిపి రాకేశ్​రెడ్డి దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న జయరాం ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయినట్లు విచారణలో తేల్చారు.

నాలుగున్నర కోట్ల లావాదేవి విషయంలో జయరాం హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. వాట్సప్​లో మహిళ పేరుతో చాటింగ్​ చేసి జయరాంను మభ్యపెట్టి రప్పించారని పోలీసులు భావిస్తున్నారు. చివరికి జూబ్లీహిల్స్​లోని తన ఇంటికి జయరాంను తీసుకెళ్లి డబ్బుల గురించి గట్టిగా నిలదీశారు. కేవలం ఆరు లక్షలు ఇచ్చినట్లు రాకేశ్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

జయరాం మృతిని ప్రమాదంగా చిత్రీకరించడానికి రాకేశ్​రెడ్డి ప్రణాళిక రచించాడు.స్నేహితులతో కలిసి కారులో మృతదేహాన్ని విజయవాడ వైపు తీసుకెళ్లాడు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో ఇద్దరు పోలీస్‌ అధికారుల పేర్లుండడంతో ప్రాథమిక విచారణ చేసిన ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేశారు. ఏసీపీపై మరింత లోతుగా విచారించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కుక్కలు చంపడానికి ఉపయోగించే విషం వాడినట్లు మొదట భావించినప్పటికీ...అలాంటిదేమి లేదని దర్యాప్తులో తేల్చారు. శరీరం నల్లగా మారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు
మెదక్​లో జయరాంకు చెందిన పరిశ్రమలో శిఖా నిర్వహణపరమైన వ్యవహారాలు చూసుకునేది. కార్మికుల తరఫున ఆ కంపెనీకి వెళ్లిన రాకేశ్,​ శిఖాతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటినుంటి తన మకాంను జూబ్లిహిల్స్​కు మార్చి ఇంటికి వచ్చేవాడుకాదని అతని తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శిఖాచౌదరి తన కుమారుడిని తప్పుదారి పట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details