ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణలో ఇద్దరు వ్యక్తులపై దుండగుల దాడి - sangareddy district murder today news

తెలంగాణలోని సంగారెడ్డిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడి చేయగా ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు వ్యక్తులపై దుండగులదాడి
ఇద్దరు వ్యక్తులపై దుండగులదాడి

By

Published : Feb 6, 2020, 5:14 PM IST

ఇద్దరు వ్యక్తులపై దుండగులదాడి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం శివారులో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్​ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details