ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

దారుణం: మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారం

ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొంత మంది నిందితులను అరెస్ట్​ చేశారు.

By

Published : Aug 26, 2020, 11:22 PM IST

gang-rape
gang-rape

తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా ఎడపల్లికి చెందిన ఓ మహిళ తన అక్కకు రోడ్డు ప్రమాదం జరగటంతో నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్ వైపు వచ్చిన ఆ మహిళను చూసిన విక్కీ అనే యువకుడు.. ఆస్పత్రి అవసరాలకు డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. కలెక్టరేట్​ వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అంతకుముందే తన స్నేహితులకు విక్కీ ఫోన్​ చేయటంతో వారు వచ్చారు. 11 మంది మిత్రులు అక్కడికి రాగా అందులో ఐదుగురు ఆ మహిళను అత్యాచారం చేశారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావటంతో యువకులు పరారయ్యారు. కొంతమందిని పోలీసులు పట్టుకొని రిమాండ్​కు తరలించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details