ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 5:26 PM IST

ETV Bharat / jagte-raho

మావోలకు నగదు.. అటవీ అధికారి అరెస్టు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. తనిఖీలు చేస్తుండగా... వారు మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.

forest beat officer arrest in bhadradri kothagudem district nallabelli
forest beat officer arrest in bhadradri kothagudem district nallabelli

ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షలు వసూలు చేసి కారులో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారు మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నగదు, కారు, ద్విచక్రవాహనం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details