ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2020, 7:01 AM IST

ETV Bharat / jagte-raho

దిశ కేసులో కీలకదశకు పోలీసుల పరిశోధన

తెలంగాణలో జరిగిన దిశ హత్యోదంతంపై ఆ రాష్ట్ర పోలీసుల పరిశోధన కీలకదశకు చేరుకుంది. హత్యాచారం చేసిన నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరీక్షించిన ఫోరెన్సిక్‌ ప్రయాగశాల.... నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలు, సూక్ష్మపరికరాలతో ప్రయోగశాలలో సాక్ష్యాధారాలను విశ్లేషించారు. ఒకటి రెండురోజుల్లో వీటిని పోలీసులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

disha-case-police-officers-investigation-in-depth
disha-case-police-officers-investigation-in-depth


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో తెలంగాణ పోలీసుల పరిశోధన కీలకదశలో ఉంది. నిందితులు... మహ్మద్‌ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌ కుమార్‌లకు వ్యతిరేకంగా ఈ కేసులో శంషాబాద్‌, షాద్‌నగర్‌ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో కీలకమైన సాక్ష్యాలు దిశ, ఆమె సోదరి స్వరం, తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద బాధితురాలని లాక్కెళ్లేటప్పుడు చిత్రీకరించిన సీసీ పుటేజీ, దిశ చరవాణిలోని నంబర్లు... సంక్షిప్త సందేశాలు.. ఫోన్‌ సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు.

కీలకమైన సీసీకెమెరా దృశ్యాలు...

దిశ హత్యాచారానికి సంబంధించి తెలంగాణలోని తొండుపల్లి టోల్‌గేట్‌ కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అత్యంత కీలకమైన చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు సమర్పించిన ఆ సీసీ కెమెరా పుటేజీని ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. నిందితుల ముఖాలు, పోలికలు కనిపించేలా సాంకేతికంగా అభివృద్ధి చేశారు.

సంభాషణల పరిశీలన...

దిశ, ఆమె సోదరి చరవాణులను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారి స్వరాలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అధికారులకు అప్పగించారు. సంఘటన జరిగిన రోజు వారు మాట్లాడుకున్న సంభాషణల రికార్డులను పరిశీలించారు. వీటిని సాంకేతికంగా పరీక్షించగా.. వారిద్దరివేనని నిర్ధారణైంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 40నిమిషాల వరకూ దిశ అక్కడే ఉన్నట్లు ఆమె చరవాణి పరిస్థితుల ప్రభావం ఆధారంగా ఉపయోగపడుతుందని తేల్చారు.

సుప్రీం ఆదేశాల మేరకు...

ఘటన జరగడానికి ముందు పదిహేను రోజులుగా దిశ ఎవరెవరితో మాట్లాడిందనే వివరాలనూ పరిశీలించారు. చటాన్​పల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు, రివాల్వర్లనూ బాలిస్టిక్‌ నిపుణులు పరిశీలించి అందులోని వివరాల రిపోర్టును ఇచ్చారని సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా ఈ సాక్ష్యాధారాలను విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!

ABOUT THE AUTHOR

...view details