ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 6:02 PM IST

ETV Bharat / jagte-raho

తెలంగాణ: విద్యుదాఘాతంతో శ్రీకాకుళం వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో భవన కార్మికుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణగా మృతుడిని గుర్తించారు.

విద్యుదాఘాతంతో తెలంగాణలో శ్రీకాకుళం వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో తెలంగాణలో శ్రీకాకుళం వ్యక్తి మృతి

హైదరాబాద్ మహా నగరంలో.. మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణ ఉపాధి కోసం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో ఉంటున్నాడు.

రోజూ మాదిరిగానే ఆదర్శనగర్​లో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. గోవా కట్టెలు కడుతుండగా ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్​తీగలు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details