ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2021, 10:44 PM IST

ETV Bharat / jagte-raho

ఏమై ఉంటుంది?: రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

ఏమైందో ఏమో తెలీదు కానీ ఇద్దరు అన్నదమ్ములు రైల్వే ట్రాక్​పై శవమై తేలారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారా.. ప్రమాదవశాత్తు మరణించారా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. కొడుకులిద్దరి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

crime news in telangana
రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు.

సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన శశికళ, బావూజీ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమారులైన దిలీప్, శ్రీకాంత్​లు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే దిలీప్ గత ఏడాది ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడగా.. నడుం దెబ్బతింది. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. తమ్ముడు శ్రీకాంత్​ అన్న దిలీప్​కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

ఏమైందో ఏమో తెలీదు కానీ నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకెళ్లిన అన్నదమ్ములిద్దరూ.. ఉదయం సమీప రైల్వే ట్రాక్​పై శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకులిద్దరు మృత్యువాతపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారా, ప్రమాదవశాత్తు మరణించారా అనే కోణంలో విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

యథాతథంగా అమ్మఒడి పథకం అమలు: మంత్రి సురేశ్

ABOUT THE AUTHOR

...view details