ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2020, 10:56 AM IST

Updated : Oct 22, 2020, 11:46 AM IST

ETV Bharat / jagte-raho

తెలంగాణ: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

10:54 October 22

మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి(9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దీక్షిత్‌ను దుండగులు అపహరించారు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా దీక్షిత్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. 

   రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామంటూ ఫోన్‌లో కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.45 లక్షల్లో కొంత డబ్బు ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకరించారు. కిడ్నాపర్ చెప్పిన సమయానికి బాలుడి తల్లిదండ్రులు డబ్బు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చోట కిడ్నాపర్ల కోసం వేచిచూశారు. కిడ్నాపర్ నుంచి స్పందన రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. బాలుడి ఆచూకీ కోసం 100 మందితో కూడిన 10 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత కథనాలు...

  1. జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!
  2. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  3. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
Last Updated : Oct 22, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details