ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2020, 7:55 AM IST

ETV Bharat / jagte-raho

ద్విచక్రహనాన్ని ఢీకొట్టిన కారు..ఒకరు మృతి

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం సమీపంలోని రైల్వే వంతెన పై ద్విచక్ర వాహనం, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్నవారు ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారని పోలీసులు తెలిపారు.

accident in anantapur dst car and bike dahed one died
accident in anantapur dst car and bike dahed one died

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన సాంకేతిక నిపుణుడు కిశోర్ యాడికిలో ఉన్న సెల్‌టవర్‌లో మరమ్మత్తులు చేయడానికి తన స్నేహితుడైన ప్రభాకర్​ను వెంట పెట్టుకొని వచ్చాడు. సాయంత్రం పని పూర్తి చేసుకుని గుత్తికి ద్విచక్ర వాహనంలో బయల్దేరారు. రాయలచెరువు రైల్వే వంతెన దిగుతుండగా ముందు వెళ్లే వాహనాన్ని అధిగమించబోయాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆదోనికి చెందిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిశోర్(35) కుడికాలు పూర్తిగా తొలగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

ప్రభాకర్ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్నవారు వాహనాన్ని ఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మల్లికార్జునరెడ్డి, జమేదారు సురేష్ రెడ్డిలు క్షతగాత్రున్ని 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాహనాల రాపోకలను పునరుద్ధరించారు

ABOUT THE AUTHOR

...view details